తిరుమ‌ల‌లో విష్ణు సహస్రనామ అఖండ పారాయణం


Ens Balu
18
Tirumala
2023-01-30 09:45:40

భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 నుంచి 9 మధ్య తిరుమల నాదనీరాజనం వేదిక‌పై విష్ణు సహస్రనామ అఖండ  పారాయణం నిర్వహించనున్నారు.  వేదపండితులు  రామానుజచార్యులు పర్యవేక్షణలో, జాతీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి డా. జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు డా. వెంకటాచలపతి విష్ణు సహస్రనామ విశిష్టతను భక్తులకు వివరిస్తారు. 3సార్లు విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతుంది. ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల పండితులు, అధ్యాపకలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనుంది.
సిఫార్సు