షిర్డీ సాయిని దర్శనానికి వెళ్లే భక్తులకు డిజిసిఏ శుభార్త
Ens Balu
18
Shirdi
2023-02-17 04:25:46
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబాను దర్శించుకునే భక్తులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షిర్డీ ఎయిర్ పోర్టులో రాత్రివేళల్లోనూ విమానాల రాకపోకలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)అనుమతించిందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. మార్చి లేదా ఏప్రిల్ లో రాత్రి సమయాల్లో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి షిర్డీకి ప్రస్తుతం 13 సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని, కేవలం పగలు మాత్రమే విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఉందని అన్నారు. కొత్తగా వచ్చిన అనుమతితో షిర్డీ సాయిబాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులతోపాటు, పలు విమాన సంస్థలు కూడా విమానాలను నడిపే అవకాశం వుంటుందని అన్నారు. కాగా నైట్ సర్వీసులు అందుబాటులోకి రావడం ద్వారా సుదూర ప్రాంతాలను వచ్చే భక్తులకు మార్గమం సుగమం కానుంది.