భారత్ లో 450 ఉద్యోగలను తొలగించిన గుగూల్
Ens Balu
12
Delhi
2023-02-18 10:17:58
భారత్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 453 మంది ఉద్యోగులను గూగుల్ ఇండియా తొలగించినట్లు తెలిసింది. ఉద్యోగం నుంచి తొలగించినట్లు సంబంధిత ఉద్యోగులకు గూగుల్ కంట్రీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా మెయిల్ పంపినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ‘మేం తీసుకున్న నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహిస్తామ’ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియజేశారు. ‘అమెరికాలో ఉద్యోగాల నుంచి తొలగించిన వాళ్లకు ఇప్పటికే ప్రత్యేక మెయిల్ ద్వారా సమాచారం తెలియజేశామని పేర్కొన్నారట. ఇతర దేశాల్లో ఈ ప్రక్రియ కొంత ఆలస్యం కావచ్చునని కానీ.. అక్కడి చట్టాలు, విధానాలే ఇందుకు కారణమ’ని ఆయన మెయిలో పేర్కొన్నట్టు తెలిసింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది అనగా మొత్తం సిబ్బందిలో 6 శాతం మందిని తొలగిస్తున్నట్లు గత నెలలో గూగుల్ ప్రకటించిన తరువాత వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.