భారత్ లోనూ త్వరలో భూకంపం వచ్చే అవకాశం


Ens Balu
29
New Delhi
2023-02-21 16:40:03

టర్కీ, సిరియా తరహాలోనే భారత్ లో త్వరలోనే భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ఎన్ జీఆర్ఐ(ngri)చీఫ్ సైంటిస్ట్ డా.పూర్ణ చంద్రరావు హెచ్చరించారు. ఈరోజు ఆయన ఒక జాతీయ వార్త సంస్థలో మాట్లాడారు. ‘భూపొరల్లో ఉండే ప్లేట్లు నిరంతరం కదులుతాయి. భారత భూభాగం కింద ఉన్న ఓ ప్లేట్ ఏడాదికి 5 సెం.మీ వేగంతో కదులుతోంది. దీంతో హిమాలయాలపై ఒత్తిడి పెరిగి హిమాచల్ ప్రదేశ్, యూకేలో భారీ విపత్తు సంభవించొచ్చు.’ అని పేర్కొన్నారు. అయితే ముందస్తు చర్యలతో ముప్పు తప్పించుకోవచ్చనని హెచ్చరించారు. కాగా ఇటీవలే టర్కీ, సిరియాలో కూ భూకంప హెచ్చరికలు వచ్చాయి. అయితే హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో లెక్కకు మించిన ప్రజలు భూకంపంతో మ్రుత్యువాత పడగా, వేలల్లో భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ నేపథ్యంలో  ఎన్జీఆర్ఐ శాస్త్రవేత చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.
సిఫార్సు