విశాఖ మీడియాకి జి-20 సదస్సుల్లోకి నో ఎంట్రీ


Ens Balu
7
Visakhapatnam
2023-03-23 11:11:59

విశాఖ వేదికగా ఈనెల 28, 29 తేదీల్లో జరుగనున్న జి-20 సదస్సుల కవరేజికి స్థానిక మీడియాకి నో ఎంట్రీ. మొత్తమంతా ఢిల్లీ నుంచి మానటరింగ్ చేస్తున్నారు. ఇది కేం ద్ర ప్రభుత్వం నిర్వహించే సదస్సుకావడంతో జిల్లా అధికారులు ప్రోటోకాల్ డ్యూటీలు చేయడం తప్పితే మరేమీ చేయడం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ లో జరుగుతున్న ఈ ప్రపంచస్థాయి సదస్సుకి ప్రచారం మొత్తం స్థానిక మీడియానే రెండు నెలలుగా ఇస్తూ వస్తోంది. అయితే ఇపుడు అధికారులు చాలా తేలిగ్గా లోకల్ మీడి యాకి నో ఎంట్రీ ఏం చేసినా మొత్తమంతా డిల్లీ నుంచే అంతా చూసుకుంటున్నారు అని చేతులెత్తేశారు జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున. కార్యక్రమాల వివరాలు మాత్రం ఏ యూలో ఒకచోట షార్ట్ బ్రీఫింగ్ ఇస్తామని చెబుతున్నారు. విశాఖలో జరిగే కార్యక్రమాల ప్రచారానికి మీడియా కావాలికానీ, కవరేజికి మాత్రం డిల్లీ మీడియానా.. ఇన్వెస్టిమెం ట్ సమ్మిట్ లోనూ అలానే చేశారంటూ విశాఖ జర్నలిస్టులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సిఫార్సు