పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పెంచు తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈమేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లిం పుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీనివల్ల ఎందరో వినియోగదారు లకు మేలు జరగనుంది. జూన్ 30 లోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే జూలై 1 నుంచి పాన్ నిరుపయోగంగా మారుతుంది. ఆ తర్వాత పన్నులు చెల్లించాల్సి వస్తే అదనపు జరిమానాల్ని కూడా కేంద్రం వసూలు చేస్తుంది. ప్రస్తుతం రూ.1,000 ఫైన్ చెల్లించి, మార్చి 31 వరకు ఆధార్-పాన్ అనుసంధానించుకోవాల్సి వుంది. అయితే, 3 రోజుల్లో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోగా ఇప్పటివరకు 51 కోట్ల పాన్ కార్డులు ఆధార్తో అనుసంధానమయ్యాయి.