రష్యా భద్రతామండలి కార్యదర్శి నికొలాయ్ పాత్రుషెవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిరువురూ ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అంశాలమీద చర్చించారు. అదే విధంగా పరస్పర దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలను కూడా చర్చించారు. రానున్న రోజుల్లో రష్యా దేశంతో స్నేహపూర్వక సహకారం తదితర అంశాలు కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి.