తిరుమల శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం


Ens Balu
20
Tirumala
2023-04-01 01:35:06

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని  శుక్రవారం అర్ధరాత్రి వరకూ 61,425 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.3.01 కోట్లు వచ్చింది. 26,430 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతున్నది.  7 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

సిఫార్సు