భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో వెయ్యికిపైగా రోజువారీ కేసులు పెరగడం కలవరానికి గురి చేస్తోంది. నిన్న 1,60,742 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,335మందికి వైరస్ సోకిందని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిం చింది. మందురోజు ఆ సంఖ్య 4,435గా ఉంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 25వేల మార్కు దాటాయి. మొ త్తం కేసుల్లో బాధితుల వాటా 0.06 %గా ఉంది. రికవరీ రేటు 98.75 % గా నమోదైంది. తాజాగా కేంద్రం ఆరుగురు మరణించినట్లు ప్రకటించిం ది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,929కి చేరింది. ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశంలో కొవిడ్(Covid 19) కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్బీబీ.1.16 వేరియంట్ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్లో మ్యుటేషన్లు జరుగు తున్న కొద్దీ ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు.