శనివారం కూడా పాస్ పోర్ట్ కార్యాలయాలు పనిచేస్తాయ్


Ens Balu
14
New Delhi
2023-04-26 10:46:58

ఆంధ్రప్రదేశ్ లోని పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు ఇకపై శనివారం సైతం పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించారు. దరఖాస్తుదారుల వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతి సేవా కేంద్రాలు శనివారం సైతం పనిచేస్తాయని, ప్రతి శనివారం 2,200 స్లాట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా తరువాత చాలా మంది పాస్ పోర్టులకి దరఖాస్తులు చేసుకోవడం తగ్గించారు. గతంలో దరఖాస్తులు చేసుకున్నవారు చాలా మంది పెండింగ్ లో ఉన్నారు. కాగా అన్ని దరఖాస్తులను వేగంగా పరిశీలిండంతోపాటు, అత్యధికమందికి పాస్ పోర్టులు అందించడం ద్వారా విద్య, ఉపాది, ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లేవారికి వెసులుబాటుగా వుంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం కార్యాలయాలు పనిచేయడంతో ఇటు ఇతర రంగాలకు ఉపాది దొరకనుంది.
సిఫార్సు