సీఐఐ-యంగ్ ఇండియన్స్ వైజాగ్ చాప్టర్, పుదుచ్చేరి చాప్టర్ బృందం పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామిని, కార్మిక, రవాణా మంత్రి సి.ప్రియాంగతో భేటీ అయ్యారు. పుదుచ్చేరి చాప్టర్ ద్వారా ఈ బృందం క్రాస్ లెర్నింగ్ సందర్శనను నిర్వహించాయి. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, మంత్రిలతో భేటీ అయ్యారు. సిఐఐ చేపడుతున్న పలు అంశాలపై బృందం మంత్రితో పూర్తిస్థాయిలో చర్చించింది. మెరుగైన పద్ధతులు, భాగస్వామ్యాల అమలు గురించి మంత్రితో మాట్లాడారు. ఈ చర్చల్లో యంగ్ ఇండియన్స్ బృందం పలు సూచనలు, సలహాలు పరస్పరం అందిపుచ్చుకున్నారు. తమ విభాగం చేపడుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తం చేసేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నట్టు ప్రతినిధులు వివరించారు. వైజాగ్ ప్రతినిధి బృందానికి వైజాగ్ చైర్ రాయ్ కొడాలి, పాండిచ్చేరి ప్రతినిధి బృందానికి పాండిచ్చేరి చైర్ దిలీప్ ఆనంద్ నేతృత్వం వహించారు.