ఈనెల 28న న్యూఢిల్లీలో CNNEO సమవేశం


Ens Balu
11
Machilipatnam
2023-05-12 11:02:29

కాన్ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్ ,న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయిస్ ఆర్గనైజేషన్ సమావేశం దేశరాజధాని న్యూ ఢిల్లీ చాణిక్యపురి లోని హోటల్ సామ్రాట్ లొ జరుగుతుందని కాన్ఫెడరేషన్ సభ్యులు, అల్ ఇండియా న్యూస్పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ సీనియర్ ఉపాధ్యక్షుడు చలాది పూర్ణచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలు, నూతన వేతన సంఘ ఏర్పాటు,  రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్, యూఎన్ఐ వార్త సంస్థ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేకసమస్యలు పరిష్కరించి యూ ఎన్ ఐ పిటిఐ లను జాతీయం చెసి 1977 కి ముందు కేంద్రం పరిధిలో పని చేసినట్లే సమాచార్ గా మార్చాలన్న ప్రతిపాధనలతో పాటు ఇతర అంశాలు కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళనున్నట్టు పేర్కొన్నారు. ఈ కాన్ఫడరేషన్ సమావేశనికి పిటిఐ ఎంప్లాయిస్ ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్ యాదవ్,యూ ఎన్ ఐ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, మరియు కాన్ఫెడరేషన్ కొసధికారి ఎం.ఎల్ జోషి, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (i)(NUJI) అధ్యక్షులు రాస్ బీహారి,ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, (IJU),ది ట్రిబ్యున్ ఎంప్లాయిస్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ప్రతినిధులతో పాటు ఈ సభ్య యూనియన్ లనుండి మొత్తం 80 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఆ ప్రకటనలో తెలిపారు.