సింహాద్రి అప్పన్ను దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి


Ens Balu
19
Visakhapatnam
2023-06-11 14:19:07

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం సుప్రీంకోర్టు జడ్జి  జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ దంపతులు, ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఏవి శేష సాయి,  హైకోర్టు రిజిస్టర్ జనరల్ వై.లక్ష్మణరావు, జస్టిస్ యు.దుర్గాప్రసాద్ రావులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, ప్రధాన పురోహితులు శ్రీనివాసాచార్యులు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా జస్టిస్ దంపతులు కప్పస్తంభాన్ని అలింగణం చేసుకున్నారు. అనంతరం స్వామివారి సేవలో పాల్గొని అనంతరాలయ దర్శనం చేసుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరము వేద పండితులచే వేద ఆశీర్వచనము చేశారు. ఈఓ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి పటమును, ప్రసాదాలను అందజేశారు. వీరితో విశాఖపట్నం డిస్ట్రిక్ జడ్జి ఆలపాటి గిరిధర్ తదితర న్యాయమూర్తులు,భీమిలి ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డి, చిన్న గదిలి ఆర్ఐ, గోపాలపట్నం ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు