కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతున్నది. శనివారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 82,999మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.27కోట్లు రాగా, 38,875 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం కంపార్ట్ మెంట్ల బయటకూడా భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.