భారత దేశంలో మద్రాస్ ప్రావిన్సుతో విశాఖలో పరిపాలించిన బ్రిటీషువారంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు గడుస్తున్నా ఇంకా భయం వీడలేదు. అవును దానికి తార్కాణం విశాఖలో నేటికీ అప్పటి భవనాలైన కెజిహెచ్, విక్టోరియా ఆసుపత్రి, ఓల్డ్ లైబ్రెరీలకు, కాన్వెంట్ లకు ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకా బ్రిటీషు వారి పేర్లే ఉండటం. వాస్తవానికి కింగ్ జార్జి ఆసుపత్రి నిర్మాణానికి నాడు విశాఖను పరిపాలించిన జమిందార్ గోడె నారాయణరావు గజపతి స్వయంగా భూమి ఇచ్చి..వాటిని నిర్మించారు కూడా. ఒక్కవిశాఖలోనే కాకుండా దేశంలో నేటికీ చాలా చోట్ల బ్రిటీషు పాలనకు గుర్తుగా భవనాలకు, ప్రాంతాలకు వారి పేర్లనే ప్రభుత్వాలు ఉంచేశాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యప్రధాయినిగా వున్న కింగ్ జార్జి ఆసుపత్రికి స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టాలనే ప్రతిపాద ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వాలు పెద్దగా పరిశీలించలేదు. అంతేకాదు, మహానుభావుల జయంతికి, వర్ధంతికి సభలు సమావేశాల్లో ఘనంగా కీర్తించే అధికారులు సైతం ప్రభుత్వాలకు బ్రిటీషు వాడి పేరుతో ఉన్న కట్టడాల పేర్లను మాప్పించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు చేయడంలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఉమ్మడి విశాఖజిల్లో అల్లూరి సీతారామరాజు మన్యం పితూరి పేరుతో క్రిష్ణదేవిపేట వేదికగా చేసిన ఉద్యమం ప్రపంచంలోని బ్రిటీషు దేశాలకి నేటికి సింహస్వప్నం. భారదేశం నుంచి బ్రిటీషువాడిని తరిమికొట్టడానికి బ్రిటీషు ప్రభుత్వానికి సమాంతరంగా ఏర్పాటు చేసిన రచ్చబండ పంచాయతీ వ్యవస్థ అతిపెద్ద విజయమనే చెప్పాలి. ఆ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రాకితే బ్రిటీష్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని భావించిన తెల్లవాడు అల్లూరి సీతారామరాజుని దొంగదెబ్బతీసి.. చెట్టుకి కాల్చిచంపాడు. అగ్గిపిడుగు నేడు మన మధ్యలేకపోయినా..ఆయన చేసిన విరోచిత స్వాతంత్ర్య పోరాటం భావి తరలాకు నేటికీ దిక్సూచిగా మిగిలిపోతుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లుదాటుతున్నా నేటికీ దేశంలో ఏర్పడ్డ కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకి బ్రిటీషు వారన్నా..నిర్మించిన కట్టడాల పేర్లు మార్చాలన్నా ఒల్లమాలిన భయం అందుకే నాటి బ్రిటీషు పరిపాలకుల పేర్లతోనే చారిత్రాత్మక కట్టడాలు అలానే మిగిలిపోయాయి. తెల్లవాడిపై పోరాటం చేసి భరతమాత కోసం ప్రాణాలను త్రుణప్రాయంగా త్యధించిన అల్లూరి సీతారాయమరాజు జయంతి సందర్భంగా నైనా నాటి బ్రిటీషు కట్టడాల పేర్లను తొలగించి స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టాలని విశాఖజిల్లా వాసులు కోరుతున్నారు. ముఖ్యంగా కేజిహెచ్ కి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ద్వారా నాడు బ్రిటీషువాడిని తరిమికొట్టే క్రమంలో అసువులు బాసిన యోధుడి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా సూచిస్తున్నారు. చూడాలి ఇప్పటికైనా పాలకులు ఈ విషయంలో ఏం చేస్తారనేది..!