కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 76,254 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.09 కోట్లు వచ్చింది. 28,091 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. ఇంకా దర్శనానికి 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి వున్నారు. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.