ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి బయలుదేరివెళ్ళారు. ప్రధాని నరేంధ్రమోడీ , హోంమంత్రి ఆమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయన కలవనున్నారు. ఏపీకి రావలసిన నిధులు, బకాయిలపై వారితో చర్చించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హోంమంత్రి అమిత్షా, సాయంత్రం 4:30కి ప్రధాని మోదీ, 6 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం జగన్మోహనరెడ్డి భేటీ కానున్నారు.ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం.. అక్కడ నుంచి ఢిల్లీకి బయల్దేరారు.