ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిపించకుండా పోయిన బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల వివరాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. 2019 నుంచి 2021 వరకు ఏపీలో 22,278 మంది మహిళలు, 7,928 మంది బాలికల ఆచూకీ దొరకలేదని కేంద్రం వివరించింది. ఇక తెలంగాణలో 34,495 మంది మహిళలు, 8,066 మంది బాలికలు మిస్ అయ్యారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో కొందరు వాలంటీర్లు చేష్టల వలన మహిళలపై అఘాయిత్యాలు, కనపించకుండా పోతున్నారని ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ గణాంకాలు చర్చనీయాంశంగా మారాయి. కాగా తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తప్పిపోయిన మహిళలు, బాలికల సంఖ్య తక్కువగానే ఉన్నది. మరోవైపు గ్రామాల్లో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసు ద్వారా ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నది. మహిళల సంరక్షణకోసే ప్రత్యేకంగా వీరు పనిచేస్తున్నారు.