మణిపూర్ లో జరిగిన హింసపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సదరు ఘటనపై మహిళా జడ్జితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ లో మహిళా న్యాయమూర్తులు మణిపూర్ లోని హింస జరిగిన ప్రాంతానికి వెళ్లి విచారణ జరుపుతారని, అక్కడి బాధితులతో నేరుగా మాట్లాడతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను సభ్య సమాజం తలదించుకునే విధంగా నగ్నంగా ఊరేగించిన విషయాన్ని కోర్టు సుమోటా స్వీకరించి ఈరోజు విచారణ జరిపింది. మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచనలం రేపింది. మహిళా జడ్జిలతో కూడిన ఈ సిట్ పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి సుప్రీం కోర్టు సిజెకి నివేదిక సమర్పించనుంది. ఆ తరువాత సదరు ఘటన, దానికి సంబంధించిన బాద్యులపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.