కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సుప్రీంకోర్టు స్టేతో లోక్సభ సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. దీనితో నాలుగు నెలల తర్వాత తొలిసారి రాహుల్ లోక్సభకు వచ్చారు. సభలోకి వచ్చేముందు ఆయన పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పించారు. రాహుల్ వస్తున్న వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంట్ బయట కోలాహలంగా మారింది. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పూర్తిగా రద్దవుతుందనుకున్న తరుణంలో పార్లమెంటులోకి తిరిగి అడుగుపెట్టడంతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. పార్లమెంటులోకి అడుగుపెట్టనీయకుండా ఉండేలా ఆఘమేఘాలపై ప్రత్యేక సమావేశం ద్వారా వేటు వేసినా అది ఎక్కువ కాలం నిలవలేదు.