తిరుమల శ్రీవారి దర్శనానికి 18గంటల సమయం


Ens Balu
38
Tirumala
2023-08-08 01:45:51

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 69,733 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.37  కోట్లు ఆదాయం వచ్చింది. 28,403 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. బయట వరకూ భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు. కాగా స్వామివారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నది. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.
సిఫార్సు