కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ఆడికృత్తిక


Ens Balu
47
Tirupati
2023-08-09 09:09:56

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం ఆడికృత్తిక పర్వదినం వేడుకగా జరిగింది.  ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వ ర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం చేపడతారు. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
  ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో దేవేంద్ర‌బాబు, ఏఈఓ  సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ భూప‌తి పాల్గొన్నారు.
సిఫార్సు