తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం


Ens Balu
46
Tirumala
2023-08-25 01:25:21

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. గురువారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 67,308 మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు రాగా, 26,674 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.
సిఫార్సు