ఢిల్లీలో విశాఖ ఉక్కు కోసం ఆడారి కిషోర్ కుమార్ దృడ సంకల్పం


Ens Balu
2890
Jantar Mantar
2024-02-09 08:52:51

విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయనీయకుండా కాపాడుకున్న తరువాతే ఢిల్లీ నుంచి వెనక్కి వెళ్లాలని తెలుగుదేశం పార్గీ యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ పిలుపు నిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ఆందోళనకు కిషోర్ కుమార్ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రు హక్కు..మన విశాఖ హక్కు గా మనలో భాగం అయిన స్టీల్ ప్లాంట్ కోసం వెయ్యిరోజుల పాటు ఉద్యమం చేసిన ఉక్కుకార్మికుల సంకల్పం చాలా గొప్పదన్నారు. నాటి ప్రధాని ఇందిగారా గాంధీతో పోరాడి సాధించుకున్న ఉత్తరాంధ్రాకి చెందిన స్టీల్ ప్లాంట్ నేడు ప్రైవేటు పరం అయితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కేంద్రప్రభు ప్రత్వంపై ఒత్తిడి పెరిగేలా ఢిల్లీలోనే ఉక్కకోసం గొప్ప సంకల్పంతో ఆందోళన చేపడుతున్న కార్మికుల కష్టానికి ఫలితం దక్కితీరుతుందన్నారు. ప్రజల మెప్పుకోసం మాట్లాడే ఎంపీలంతా పార్లమెంటు వేదికగా విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా గట్టిడా అడగాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడిపైనా ఉందన్నారు. చాలా మంది ఎంపీ కేంద్రానికి వ్యతిరేకంగా విశాఖ స్టీలు ప్లాంట్ కోసం మట్లాడి తే వారిపై ఈడి రైడ్లు జరుగుతాయని భయపడుతుంటడం సిగ్గుచేటన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా స్టీల్ ప్లాంట్ ను రక్షించుకొని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్టీయూసి విల్లా రామ్మోహనరావు, పోరాట జేఏసి అధ్యక్షులు ఆయోధ్య రామ్, సిఐటియు ఆదినారాయణ, ఐఎన్టీయూసి మంత్రిరాజశేఖర్, ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు, సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ, సిపిఐ రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.