భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు భేష్‌.. పార్ల‌మెంట‌రీ క‌మిటీ


Ens Balu
27
Tirumala
2024-02-20 11:54:08

శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం దేశం న‌లుమూల‌ల నుండి విచ్చేస్తున్న భ‌క్తుల‌కు టీటీడీ ద‌ర్శ‌నం, అన్న‌ప్ర‌సాదాలు, గ‌దులు త‌దిత‌ర సౌక‌ర్యాలను చ‌క్క‌గా క‌ల్పిస్తోంద‌ని  బ్రిజ్‌లాల్ అధ్య‌క్ష‌ త‌న గ‌ల భార‌త హోం వ్య‌వ‌హారాల పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ అభినందించింది. క‌మిటీ స‌భ్యులు మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టీటీడీ అధికా రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.   ఈ సంద‌ర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి టీటీడీ ఆవిర్భావం నుండి చేప‌డుతున్న వివిధ సామాజిక, ధార్మిక, సంక్షేమ‌ కార్యకలా పాలను 40 నిమి షాల ఆడియో విజువ‌ల్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివరించారు.   అనంత‌రం క‌మిటీ ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం గొప్ప అనుభూతిని మిగిల్చింద‌న్నారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్న యాత్రికుల‌ను, తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చేప‌డుతున్న చ‌ర్య‌లు బాగున్నాయ‌ని చెప్పారు. భ‌క్తుల ర‌ద్దీ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల‌ నిర్వహణ ప్రణాళికల‌ను  ప్రశంసించారు.  కమిటీ సభ్యులు  బిప్లవ్ కుమార్ దేవ్,  నీరజ్ శేఖర్,  దిలీప్ ఘోష్,  దులాల్ చంద్ర గోస్వామి, రాజా అమరేశ్వర నాయక్, డాక్టర్ సత్యపాల్ సింగ్, డాక్టర్ నిషికాంత్ దూబే, హోం వ్యవహారాల శాఖకు చెందిన ఇతర అధి కారులతో పాటు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పీ  మలికా గార్గ్, టీటీడీ, జిల్లా, పోలీసు శాఖల ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.