పెరుగుట విరుగట కొరకేనని సోషల్ మీడియా యాప్ వాట్సప్ ఇప్పుడిప్పుడే వినియోగదారుల అకౌంట్ లను నిలిపివేస్తూ.. హెచ్చరికలు జారీ చేస్తున్నది. షడన్ గా యాప్ ని నిలుపుదల చేసి దిస్ అకౌంట్ కెన్ నో లాంగర్ యూజ్ డ్యూటు ది స్పామ్ అని చెప్పి ఏకంగా 24 గంటలు ఆపేస్తున్నది. ఆ తరువాత వాట్సప్ కి సాంకేతిక సిబ్బంది కాళ్లా వేళ్లా పడితే తప్పా మళ్లీ వాట్సప్ యాప్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. మనకి అత్యవసర సమయంలో వాట్సప్ నిలిచిపోతే పరిస్థితి ఏంటి..? అప్పటి కప్పుడు జరగాల్సిన పనులు ఏం కావాలి అనే అలోచనకు సోషల్ మీడియా దిగ్గజం టెలీగ్రామ్ యాప్ ను కూడా వినియోగదారులు ఇపుడు వినియోగించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఖచ్చితంగా సమాచార విస్తరణ, సేకరణ కోసం ఖచ్చితంగా టెలీగ్రామ్ యాప్ వినియోగించాల్సిన ఆవశ్యకతను వాట్సప్ పరోక్షంగా చెప్పకనే చెబుతున్నట్టు అవుతోంది. ఏ మీడియాలో ఉన్నవారి నెంబరో, లేదంటే ఏ ప్రయాణంలో ఉన్నప్పుడో, పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడో వాట్సప్ షడన్ గా ఆగిపోతే పరిస్థితి ఏంటినేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఆశన్నమైంది.
స్పామ్ కాల్స్, స్పామ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారని.. లేదంటే ఏఐ అనుకోకుండా మీ వాట్సప్ అకౌంట్ ని నిలుపుదల చేసిందని, లేదంటే బ్యాన్ చేసిందనే సమాచారం వినియోగదారులకు అగ్ని పరీక్షలాంటిదే. ఇలాంటి విపత్కర సమయంలో టెలీగ్రామ్ యాప్ ఆపద్భాందవుడిగా వినియోగదారులకు చాలా చక్కగా ఉపయోగ పడుతున్నది. అంతేకాదు వాట్సప్ కంటే అత్యధిక ఫీచర్లు టెలీగ్రామ్ లో ఉన్నాయి. పెద్ద వీడియోలతోపాటు, ఎంతటి భారీ ఫైల్స్ అయినా టెలీగ్రామ్ ద్వారా షేర్ చేసుకోవడానికి అవకాశం వుంటుంది. అంతేకాకుండా వాట్సప్ కంటే అత్యధికంగా సెక్యూరిటీ ఆప్షన్స్ కూడా టెలీగ్రామ్ లో ఉన్నాయి. కానీ ఎందుకనో వాట్సప్ ను మాత్రమే చాలా మంది వినియోగిస్తున్నారు. కానీ.. ఇపుడు అలా వాట్సప్ పైనే నమ్మకం పెట్టుకొని దానిని మాత్రమే వినియోగిస్తే నట్టేట ముగినిపోవడం ఖాయమని వాట్సప్ ఒక్కక్కరికీ బ్లాక్ అవుతున్నప్పుడు గానీ తెలిసి రావడం లేదు.
వాట్సప్ లో ఏఐ టూల్ వచ్చిన తరువాత మరిన్ని ఇబ్బందులు తలెత్తులున్నాయి వాట్సప్ వినియోగదారులకు అయినా వాట్సప్ నే వినియోగిస్తున్నారు తప్పితే ఇబ్బందులు పడేకంటే చక్కగా టెలీగ్రామ్ వినియోగిస్తే బెటర్ అనే ఆలోచన మాత్రం రావడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో వాట్సప్ ఇబ్బడి ముబ్బడిగా చాలా మంది అకౌంట్లను బ్యాన్ చేయడంతో వాట్సప్ వినియోగ దారులందరూ ఆలోచనలో పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారస్తులపై ఈ వాట్సప్ బ్యాన్ తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. మీడియాలో పనిచేసేవారు అత్యధికంగా సమాచారం అన్ని వర్గాల వారికి షేర్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అదునుచూసి వాట్సప్ బ్యాన్ అయి 24 గంటలు ఎలాంటి ఉలుకూ పలుకూ లేకపోవడం కూడా జర్నలిస్టులుకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడున్నది. దానితో ఇపుడు సోషల్ మీడియా యాప్స్ ఒకే దానిని నమ్ముకుంటే కాదని.. ఖచ్చితంగా టెలీగ్రామ్ యాప్ కూడా వినియోగించాలనే నిర్ణయానికి వచ్చారు.
ఆ లోచన రావడంతోనే వాట్సప్ తోపాటు, టెలీగ్రామ్ యాప్ ను కూడా వినియోగించే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది. సోషల్ మీడియాని అలవాటు చేసిన మెటా ఇపుడు ఏఐ టూల్, ఇతరత్రా కారణాలతో వాట్సప్ ను బ్యాన్ చేస్తుండటంతో అందరూ టెలీగ్రామ్ కి మారుతున్నారు. వాట్సప్ ఇదే బ్యాన్ పద్దతిని కొనసాగితే టెలీగ్రామ్ యాప్ అత్యంత త్వరగా అన్ని వర్గాలకు చేరువ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం వాట్సప్, మెటా యాజమాన్యాలకి తెలిసినా లైట్ తీసుకుంటున్నాయి తప్పితే చేస్తున్న తప్పులకు, అకౌంట్ బ్యాన్ వంటి అంశాల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం లేదు. అదీ కూడా ఒకందుకు మందిచే అవుతుందని చెబుతన్నారు విశ్లేషకులు. ఎల్లప్పుడూ ఒకే సోషల్ మీడియా యాప్ ని వినియోగిస్తే.. వాడి చేతుల్లోకే వినియోగదారులు వెళ్లిపోతారని.. ఆ పరిస్థితి మారాలాంటే వినియోగదారులు బహు విధాలుగా ఉపయోపడే సెక్యూరిటీ ఉన్న సోషల్ మీడియా యాప్స్ ని సేఫ్ సైడ్ గా పెట్టుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఎంతో నమ్మకాన్ని కూడగట్టుకున్న మెటా వాట్సప్.. ఇపుడు అదే నమ్మకాన్ని వినియోగదారుల పాలిట భయంగా మార్చుకుంటున్నది..?!