భారతదేశంలో 15 ఏళ్ల తరువాత మళ్లీ జన-కుల బలం ప్రదర్శన..?!


Ens Balu
277
viskahapatnam
2025-06-17 10:47:46

భారత దేశంలో సరిగ్గా 15ఏళ్ల తరువాత జన-కుల బలం ప్రదర్శన జరగబోతుంది. ఇప్పటి వరకూ మా సామాజిక వర్గం పెద్దది.. మా సామాజిక వర్గమే పొడుగు.. మాతరువాత ఇంకెవరైనా అంటూ భీరాలు పోయేవారందరి లెక్కలు అధికారింగా తేలిపోనున్నాయి. దానికోసం కేంద్రప్రభుత్వం జన-కుల గణను గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  గత కొద్దిరోజుల ముందే జనాభా గణణ జరగుతుందని.. దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకటించగానే ఎవరి కుల బలం ఎంతుందో తెలియజేసే ప్రయత్నాలకు అంతా తెరలేపారు. ఎవరి సామాజిక బలం ఎంతుందో సంఘాల వారీగా లెక్కపెట్టుకునే పని మొదలు పెట్టారు. అవన్నీ ప్రైవేటుగా జరుగుతున్నవే అయినా.. ఎవరి సామాజిక వర్గం వారి లెక్కలు వారు ముందుగానే వేసుకుంటున్నారు. గతంలో కుల, జనన బలాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఈ జనాభా గణన ఎప్పుడైతే లెక్కించడం మానేశారో అప్పటి నుంచి కుల, జన గణనకు రాజకీయ రంగు అంటుకుంది. దానితో ఎవరికి కుల బలం, ఓట్ల బలం ఉంటే వారికి చట్టసభల్లో సీట్లు ఇవ్వడం ప్రారంభించాయి రాజకీయపార్టీలు. 

ఫలితంతా అన్ని సామాజిక వర్గాల్లోనూ వారి సంఖ్యా బలాన్ని అనధికారికంగా లెక్కించుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే జనగణన జరగాల్సి వున్నా.. విభజన జరిగిపోయిన పదేళ్ల తరువాత కూడా జరగలేదు. కానీ ఇపుడు తప్పక, విభజన హామీలు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఇపుడు కేంద్రం జన, కులగణన చేపట్టనుంది. ఇది పూర్తయితేనే జనాభా సంఖ్య ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, అదే సమయంలో కొత్త జిల్లాలు, స్థానిక సంస్థల పునర్విభజన ఇలా చాలానే పనులకు మోక్షం వస్తుంది. అదే సమయంలో ఎవరి సామాజిక బలం ఏంటో కూడా రాజకీయ పార్టీలకు ఇక అధికారికంగా లెక్కలతో సహా తెలుస్తుంది. అపుడు మేమే పొడుగు అన్న పదం.. మేము చాలా ఎక్కువ మందిమి అనే సౌండ్ చేయడానికి లెక్కలు చాలా క్లియర్ గా కనిపించి ముందర కాళ్లకి బంధం వేస్తాయి. ఒకప్పడు ఒక్కో జిల్లాల్లో ఒక్కో సామాజిక వర్గం బల ప్రదర్శన చేస్తూ వచ్చి రాజకీయం చేశారు.  కొన్ని సామాజిక వర్గాల్లో వారి సంఖ్యా బలం తగ్గిపోవడంతో కులంలోని వర్ణాలు, వర్గాలు వేరుగా ఉన్నా తామంతా ఒకే సామాజిక వర్గం అని చెప్పుకున్నాయి కొన్ని సామాజిక వర్గాలు. 

ఇపుడు అదే పాచికను ప్రధాన సామాజిక వర్గాలు కూడా అమలు చేసే యోజనలో పడ్డాయి. అలా చేయకపోతే వారి సామాజికవర్గం బల ప్రదర్శన చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. దానికోసం కేంద్రం కుల, జన గణనకు పచ్చజెండా ఊపగానే చాపక్రింద నీరులా సామాజిక వర్గాలు ఎవరికి వారు సమావేశాలు, సభలు, సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసుకొని ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా వారి బలాన్ని ప్రదర్శించానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇపుడు కులగణన చేసిన తరువాత ఒకే సామాజిక వర్గంలోని వర్ణాలు తేడాగా ఉన్నా, సంబంధీక కులానికి దగ్గరగా వుంటే వారంతా ఏకమయ్యే అవకాశాలు కనిస్తున్నాయి. కారణం గతంలో రెండు మూడు సామాజిక వర్గాలు చేసిన రాజకీయ చదరంగ ఎత్తుగడను ఇపుడు అన్ని సామాజిక వర్గాలు కూడా అమలు చేయాలని చూస్తున్నాయి. ఉదాహరణకు స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో చేనేత కుటుంబాల సంఖ్య ఇంచుమించు కోటి 10 లక్షలుపైనే ఉంది. 

అది 1970 వచ్చేసరికి ఆ సంఖ్య నాలుగు కోట్లకు పైగా చేరింది. తెలుగు రాష్ట్రాలలో ఈ కులాల వారు 12 -15 మిలియన్‌లుగా అంటే రాష్ట్రాల జనాభాలో 13 -15 శాతం మంది ఉన్నప్పటికీ సరియైన ప్రాతినిధ్యం కూడా లేదు. దేశంలో తరతరాలుగా ఈ వృత్తిలోనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, తొగటశాలీలు, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి, సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, కరికాలభక్తులు, తొగుల వీరక్షత్రియ, సాధనాశూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కుర్ని, ఖత్రి, నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్, కైకోల, కైకోలన్, సెంగుండం, సెంగుంతర్, సాలివన్, నెస్సి మొదలైన కులాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ కులాలు ఎంబీసీ జాబితాలో ఉన్నాయి.  ఇరు రాష్ట్రాల మొత్తం 294 శాసనసభ నియోజకవర్గాల్లో 60-70 నియోజకవర్గాలలో గెలుపుపై ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాల వారు ఉన్నారు. ఇక్కడున్న సమస్య అల్లా ఒక్కటే చేనేత కులానికి చెందిన వారే.. ఇక్కడ సామాజిక వర్గాల్లో వర్ణాలు వేర్వేరుగా ఉండటంతో వీరు మా వారు కారు అనే లక్ష్మణరేఖ గీసుకున్నారు.

 కాలక్రమంలో చేతనే సామాజిక వర్గం చేసిన తప్పుని ఇతర సామాజిక వర్గాలు వారికి అనుకూలంగా మార్చుకొని వర్ణాలు వేరైనా.. మేమంతా ఒక్కటే సామాజిక వర్గానికి చెందిన వారమని వారి బలాన్ని ప్రదర్శించుకుని రాజకీయం ఎదిగారు. అంతా అయిపోయిన తరువాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి అన్నట్టుగా చేనేత సామాజిక వర్గం చాలా కాలం బల ప్రదర్శనలో వెనుకబడిపోయింది. కానీ ఇపుడు కేంద్రం మళ్లీ కుల, జన గణన చేపడుతుండటంతో ఇతర సామాజిక వర్గాలు మాదిరిగా సామాజిక వర్గం వర్ణాలు కాకుండా ఒక్కటే సామాజిక వర్గం అనే విధంగా ఒకే తాటిపైకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రంలోనూ అదిపెద్ద మూడవ సామాజిక వర్గంగా అవతరిస్తుందనే అంశం ఇపుడు మిగిలిన సామాజిక వర్గాలను కలవరపెడుతున్నది. వారి బల ప్రదర్శన చేయడానికి సదరు సామాజిక వర్గాల్లోని వారు కూడా వర్ణంతో సంబంధం లేకుండా ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని కుల ప్రదర్శన చేయడానికి సిద్దపడుతున్నారు. 

2027కి పూర్తవనున్న జన కుల గణన అనంతరం అధికారిక లెక్కలు ఏ సామాజిక వర్గాన్ని ఏ స్థాయిలో నిలబెడుతుంది..? ఎవరికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తారు..? ఎవరి సామాజిక వర్గం బలం.. బలగం ఎంతో తేలిపోయి.. రాజకీయ ప్రకటనలకు తెరపడుతుంది. అపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు కూడా ఒక అంచనాకు వస్తాయి. 15ఏళ్ల తరువాత జరుగుతున్న ఈ కుల, జన గణన ఫలితాల కోసం వేచి చూడటమే తరువాయి..!