24గంటల్లో కర్నాటకలో 10వేల మంది కోలుకున్నారు..
Ens Balu
2
New Delhi
2020-10-12 14:51:12
భారతదేశంలో కొత్తగా కోలుకున్నవారిలో 77% మంది పది రాష్ట్రాలలోనే ఉండగా అందులో మహారాష్ట్ర, కర్నాటక ఒకే రోజులో 10,000 మందికి పైగా కోలుకున్నారు. గత 24 గంటలలో కొత్త కోవిడ్ పాజిటివ్ నమోదైన కేసుల సంఖ్య 66,732 కాగా, వాటిలో దాదాపు 81% పది రాష్ట్రాలలోనే నమోదు కావటం గమనార్హం. 10,000 కి పైగా కేసులతో మహారాష్ట్ర అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మిగలగా దాదాపు 9,000 కేసులతో కర్నాటక, కేరళ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఇక 24 గంటలలో కోవిడ్ మరణాలు 816 నమోదయ్యాయి. వీటిలో 85% కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. నిన్నటి మరణాలలో 37% పైగా (309 మంది) నమోదు చేసుకున్న మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలతోపాటు, ప్రజలకు మెరుగైన వైద్యసేలు కూడా మెరుగ్గా అందడటంతో కోవిడ్ కేసులు తగ్గుదల నమోదు అవుతుందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.