భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ యుద్ద విమానాలు..
Ens Balu
2
Ambala
2020-07-29 15:17:47
రాఫెల్ రాకతో భారత వైమానికదళం శత్రు దుర్భేద్యం కానుంది. భారత్ అమ్ములపొదలో అత్యాదునిక "రాఫెల్' యుద్ద విమానాలు కొలువుదీరనున్నాయి. గంటకు 2200 కి.మీ ప్రయాణం అత్యంత వేగంగా చేయగల సత్తా రాఫెల్ కలిగివుంది. అలాగే 9000 కేజీల బరువు తీసుకెళ్ళే సామర్థ్యం రాఫెల్ సొంతం. 40 లక్ష్యాలను ఎంచుకొని ఒకేసారి చేధించగల సత్తా కలిగిన రాఫెల్ యుద్ద విమానాలు అవలీలగా చేస్తాయి. అత్యాదునిక రాడార్ సాంకేతిక వ్యవస్థతో ఎలాంటి వాతావరణంలోనైనా క్షిపణి ఫైరింగ్ లో సుదూర ప్రాంతాలలో ఉన్న టార్గెట్ లను మిస్ కాకుండా చేయగలడంలో రాఫెల్ మేటి. అలాంటి యుద్ధ విమానాలు భారత భూభాగంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈఎన్ఎస్ లైవ్ సాదర స్వాగతం పలుకుతుంది. మరి కసేపట్లో అంబాలా ఎయిర్ బేస్ లో దిగనున్న శుభ తరునంలో భారతీయులుగా మనందరం గర్వపడాలి. ఇదే ఉత్సాహంతో శత్రుదేశాలకు మన సత్తా కూడా రాఫెల్ తోనే తెలియజేయాలని కూడా ఈఎన్ఎస్ లైవ్ సగర్వంగా మనవి చేస్తుంది.