శ్రీవారి కళ్యాణం కారణంగానే అయోధ్య లైవ్ ఇవ్వలేదు..


Ens Balu
2
Tirumala
2020-08-09 22:36:34

ఎస్వీబీసీలో శ్రీవారి కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం కారణంగా అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించలేకపోయామని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్ప‌ష్టం చేశారు. ఆదివారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. కావాలనే ఎస్వీబీసీ ద్వారా రామ మందిరం భూమిపూజ లైవ్ కవరేజీ చేయలేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. శ్రీవారి కళ్యాణం కారణంగా ఇవ్వలేని లైవ్ ప్రాసారాన్ని ఆ త‌రువాత న్యూస్ బులెటిన్లో ప్ర‌ముఖంగా ప్ర‌సారం చేశామని వివరించారు. ఇందులో ఎలాంటి ఇత‌ర ఉద్దేశాలు లేవన్నారు. కొంత‌మంది దీనిపై అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌లు చేసే ప‌ని ప్రారంభించడం తగదన్నారు. వాస్తవాలు తెలుసుకొన్న తరువాత తప్పుఉంటే మాట్లాడాలని సూచించారు. హిందూధార్మిక కార్యక్రమాలన్నింటినీ ఎస్వీబీసీలో ప్రముఖంగా చూపిస్తున్నట్టు ఈఓ చెప్పారు.
సిఫార్సు