మన కరెన్సీనోట్లు తయారీకి ఎంత ఖర్చుఅవుతుందంటే..
Ens Balu
5
Delhi
2020-08-10 12:02:00
భారతదేశంలో ప్రజలు, ప్రభుత్వం నిత్యం వినియోగించే డబ్బు(కరెన్సీ నోటు) తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? అయితే ఇది మీకోసమే...మనం నిత్యఅవసరాలు, కొనుగోలు, బ్యాంకుల్లో దాచుకునే కరెన్సీ నోట్ల తయారీకి అయ్యే ఖర్చుని ఆర్బీఐ వెల్లడించింది. వరుసగా రూ. 50 నోటుకు 82 పైసలు,రూ. 20 నోటుకు 85 పైసలు,రూ. 10 నోటుకు రూ. 75 పైసలు చొప్పున ఖర్చవుతోందని తెలిపింది. అంతేకాకుండా 1, 2, 5 రూపాయల నోట్ల ముద్రణను సైతం ఆర్బీఐ గత నాలుగేళ్లుగా నిలిపివేసినట్టుగా కూడా చెప్పింది. మొత్తం మీద ఈ నాలుగేళ్లలో రూ. 2,458.57 కోట్ల విలువైన రూ. 500 నోట్లు,రూ. 370.10 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ ముద్రించిందిని సవివరంగా వెల్లడింది. అదన్నమాట సంగతి...