ఊరూ..వాడా..ఘనంగా శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు..!


Ens Balu
2
Visakhapatnam
2020-08-11 09:47:30

శ్రీక్రిష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున క్రిష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిన్నిపిల్లకు గోపికల వేషం వేసి శ్రీక్రిష్ణుడికి పూజలు చేయించారు. వేకువ జామునుంచే శ్రీక్రిష్ణ ఆలయాలన్నీ కిటకిటలాడాయి. చాలాచోట్ల స్వామికి ఇష్టమైన వెన్నను భక్తులు నైవేద్యంగా పెట్టారు. ఉట్టివేడుకలతోపాటు, ప్రత్యేక ఎంటర్ టైన్ మెంట్ యాప్ లు అందుబాటులోకి రావడంతో చిన్నిపిల్లల ఫోటోలను శ్రీక్రిష్ణుడి గెటప్ లో కి మార్చి వాటికి మంచి పాటలను సెట్ చేసి తల్లితండ్రులు, చిన్నపిల్లలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వున్న భక్తులంతా కరోనా వైరస్ ను రూపుమాపాలంటూ  శ్రీక్రిష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిఫార్సు