కరోనా టెస్ట్ నెగిటివ్ అయితేనే అయ్యప్ప దర్శనం...


Ens Balu
2
2020-08-11 13:10:08

శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల కోసం దేవస్థానం, అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్పను చూడాటినికి వచ్చే స్వాములు తప్పనిసరిగా కరోనా పరీక్షలు జరిపించుకోవాల్సి ఉంటుందని ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్టు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా వెంట తీసుకొని రావాలని పేర్కొంది. కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు. 2 నెలల దర్శనాల నిమిత్తం ఆలయం నవంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల కారణంగా దాదాపు 5 నెలలపాటు శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం తెరుచుకోలేదు.
సిఫార్సు