మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ ఆరోగ్యం మరింత విషమం
Ens Balu
1
New Delhi
2020-08-11 21:36:52
బ్రెయిన్ సర్జరీ కారణంగా ఆసుపత్రిలో ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ ఆరోగ్యం మరింత క్షిణించిందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రణబ్కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్యంపై మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు. మాజీ రాష్ట్రపతికి సోమవారం బ్రెయిన్ సర్జరీ చేసి మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. తరువాత చికిత్స పొందుతున్న ఆయనకు పరిస్థితి విషయమించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.