అందులో 12వ రాష్ట్రంగా రాజస్థాన్..


Ens Balu
2
Rajasthan
2021-02-10 15:07:44

“ఒకేదేశం, ఒకే రేషన్ కార్డు”  అనే సంస్కరణ వ్యవస్థను దేశంలో విజయవంతంగా అమలు చేసిన 12వ రాష్ట్రంగా రాజస్థాన్ పేరుగాంచింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిర్దేశించిన ఈ సంస్కరణను రాజస్థాన్ సమర్థంగా అమలు చేసింది. తద్వారా,.. బహిరంగ మార్కెట్లో రుణాల సేకరణ ద్వారా అదనంగా రూ. 2,731కోట్ల మేర ఆర్థిక వనరుల సేకరణకు రాజస్థాన్ అర్హత సాధించింది. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం తగిన అనుమతిని ఇప్పటికే మంజూరు చేసింది. ఒకేదేశం, ఒకే రేషన్ కార్డు  అన్న సంస్కరణను ఇప్పటికే విజయవంతంగా అమలు చేసిన 11 రాష్ట్రాల సరసన తాజాగా రాజస్థాన్ చేరింది. ఇప్పటివరకూ ఆంధప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ సంస్కరణను సమర్థవంతంగా అమలు చేశాయి.  “ఒకేదేశం, ఒకే రేషన్ కార్డు”  సంస్కరణను విజయంవతంగా అమలు చేసిన ఈ 12 రాష్ట్రాలకు అదనపు రుణాల సేకరణకు అనుమతి లభించింది. మొత్తం రూ. Rs.33,440 కోట్ల మేర రుణాల సేకరణకు ఈ రాష్ట్రాలకు కేంద్ర వ్యయ శాఖ అనుమతి ఇచ్చింది. 
సిఫార్సు