ప్రధాని ట్రోఫీ విజేతకు ఈవో అభినందన..


Ens Balu
3
తిరుమల
2021-02-11 22:02:49

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ లో పాల్గొని ప్రధాని ట్రోఫీ గెలుచుకున్న శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి ఎ. హరిప్రసాద్ ను టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అభినందించారు.  గురువారం సాయంత్రం టీటీడీ పరిపాలన భవనంలో హరిప్రసాద్ ఈవోను కలిశారు.  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట  హరిప్రసాద్ స్వగ్రామం. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న హరి ప్రసాద్ రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఎన్ సిసి తరపున ఎయిర్ వింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కేరే ఎంపికయ్యారు. పరేడ్ లో విశేష ప్రతిభ కనబరచి 15 ఏళ్ళ తరువాత ఆంద్రప్రదేశ్ కు ప్రధాని ట్రోఫీని సాధించారు.  హరిప్రసాద్ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సి ఎం అతన్ని అభినందించి రాష్ట్రం తరపున ట్రోఫీ తో పాటు రూ 2 లక్షల ప్రోత్సాహక నగదు బహుమతి అందించారు.   ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఈవోను కలిశారు. వారిని రిపబ్లిక్ డే పరేడ్ ఎంపిక విధానం గురించి ఈఓ అడిగి తెలుసుకున్నారు. టీటీడీ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థి పి ఎం ట్రోఫీ గెలవడం అభినందనీయమన్నారు. తాను సివిల్ సర్వీసెస్ కు ఎంపికై ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నట్లు హరిప్రసాద్ ఈవోకు తెలిపారు. టీటీడీ విద్యా విభాగం డిప్యూటీ ఈవో  గోవింద రాజన్, హరిప్రసాద్ తల్లిదండ్రులు  ఎ. శ్రీనివాసులు,  ఎ. కమల, ఎన్ సిసి కేర్ టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ పి.మోహన్, ఎస్వీ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ టి.నారాయణమ్మ, డాక్టర్ ఎల్ ఆర్ మెహన్ రెడ్డి పాల్గొన్నారు.
సిఫార్సు