12 న కేంద్ర రైల్వేశాఖ మంత్రి రాక ..
Ens Balu
3
Tirupati
2021-03-11 18:27:23
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పర్యటన లో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఈ నెల 12 న సా. 6.35 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం సా. 7 గం. లకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకుని పూజలు నిర్వహించి రా. 9 గం.లకు తిరుమల చేరుకుంటారని తెలిపారు. 13 వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఉ.9.15 గం. లకు తిరుమల నుంచి బయల్దేరి ఉ.10.15 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఆపై ఉ. 10.50 లకు ఢిల్లీ బయల్దేరి వెళతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.