రూ.1860 కోట్ల ఈఎస్ఐ ఆసుపత్రి..
Ens Balu
3
New Delhi
2021-03-16 21:37:59
రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం ఆపరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాకు మరో కేంద్ర పథకం ప్రాజెక్టు మంజూరయింది. రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ను కలిసి ఈ మేరకు ప్రాజెక్టును మంజూరు చేయించారు. ఈ మేరకు గోపాలపురం నియోజకవర్గం పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ మంజూరు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ నుంచి ఎంపీ మార్గాని భరత్ మంగళవారం మీడియాకు తెలియజేశారు. రాజమహేంద్రి పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారికి సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ పరిధిలో కూడా పలు క్వారీలు పరిశ్రమలు ఉండటం, పట్టణ గ్రామీణ ప్రజలు, కార్మికులు అధికశాతం ఉన్న నేపథ్యంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కృషి చేయడంతో కేంద్ర మంత్రివర్యులు గాంగ్వర్ కు విజ్ఞప్తి చేయడంతో ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరైనట్టు ఎంపీ భరత్ రామ్ వివరించారు. సుమారు రు. 1860 కోట్ల నిధులతో నిర్మాణం జరుగుతున్న కొవ్వూరు గుండుగొలను జాతీయ రహదారి పరీవాహ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఎంతో మంది కార్మికులు ఈ ప్రాంతంలో ఆసుపత్రి వల్ల వైద్య సదుపాయాలు అందుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. నిత్యం విపరీతమైన ట్రాఫిక్ రద్దీ తో ఉండే ఈ ప్రాంతంలో ఈ ఆసుపత్రి నిర్మాణం ఎంతో అందుబాటులో ఉంటుందని ఎంపీ వివరించారు. ఇటు కొవ్వూరు, అటు గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని కార్మిక రంగానికి ఈ ఆసుపత్రి అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులో ఉండగలదని తెలిపారు.
ఈ నేపధ్యంలో కొవ్వూరు నుంచి గోపాలపురం మధ్యలో జాతీయ రహదారిని ఆనుకొని ఈ వంద పడకల ఇఎస్ఐ ఆస్పత్రిని నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ ఎంపీ కృతజ్ఞతలు తెలియజేశారు.
త్వరలో ఇఎస్ ఐ ప్రత్యేక డ్రైవ్ ఈ మేరకు త్వరలో పశ్చిమ గోదావరి జిల్లా పరిధి లోని కార్మికులు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరు ఇఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కార్మికుల ఇఎస్ఐ నమోదు ప్రక్రియను త్వరలో ప్రత్యేకంగా చేపట్టనున్నట్టు ఎంపీ భరత్ రామ్ తెలియజేశారు. ఈ మేరకు సంస్థలు, కంపెనీలు ఫ్యాక్టరీ యాజమాన్యాలు కార్మికుల ఈఎస్ఐ నమోదు కృషి చేయాలని ఎంపీ భరత్ రామ్ తెలిపారు.