ఆ విధానంతో ఎవరి ఓటు వారే వేస్తారు..


Ens Balu
4
New Delhi
2021-03-17 21:56:11

కేంద్ర ప్రభుత్వం నకిలీ ఓటర్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది... ఇక నుంచి ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయనున్నట్టు లోక్‌సభలో వెల్లడించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎంపీ దయానిధి మారన్ వేసిన ప్రశ్నకు లోక్‌సభలో బుధవారం సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి ఇకపై ఓటర్ ఐడీకి ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి ఇకపై ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో కూడా తెలుసుకునే వీలు ఉంటుందన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాఎప్పటికప్పుడు బోగస్ కార్డులు బటయపడుతూనే ఉన్నాయి.మరోవైపు తమ ఓటు గల్లంతు అయ్యిందంటూ ఆందోళన వ్యక్తం చేసేవారు పెరుగుతూనే వస్తున్నారు. ఎన్నికలకు వచ్చిన ప్రతీసారి ఇది ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పిగా మారింది. జాగ్రత్తలు తీసుకుంటున్నా బోగస్‌ కార్డులను ఈసీ నియంత్రించడంలో విఫలం అవుతూనే వస్తుంది. బోగస్ కార్డులను అరికట్టేందుకు ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఇప్పటికే న్యాయ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఓటర్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు బోగస్ ఓట్లను సులభంగా తీసేయొచ్చనని పేర్కొంది.
సిఫార్సు