శ్రీవారి సేవలు నిలుపుదల..


Ens Balu
10
తిరుమల
2021-04-20 17:46:21

దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీవారి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.  దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు శ్రీవారి సేవకు వచ్చే భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు ప్రకటన విడుదల చేసింది. తదుపరి శ్రీవారి సేవ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేది ముందుగానే తెలియజేయగలము. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో శ్రీవారి సేవకు రాదలచిన భక్తులు ఈ మార్పు గమనించి తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాల టిటిడి అధికారులు కోరుతున్నారు.
సిఫార్సు