తిరుమల శ్రీవారికి ఆదివారం టయోటా ఇన్నోవా కారు విరాళంగా అందింది. హర్ష టయోటా సంస్థ తరఫున టిటిడి బోర్డు మాజీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి దాదాపు రూ.20 లక్షల విలువైన కారును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను ఆలయ డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి సిబ్బంది పాల్గొన్నారు.