BSNLసీఎండీ డికెపర్వాన్ త్వరగా కోలుకోవాలి..


Ens Balu
3
2021-04-28 15:03:05

బీఎస్ఎన్ఎన్ఎల్ సీఎండీ డి.కెపర్వాన్ కోవిడ్ బారి నుంచి త్వరగా కోలుకొని, విధులకు హాజరు కావాలని భారతీయ టెలీకాం ఎంప్లాయిస్ యూనియన్(బీఎస్ఎన్ఎల్), భారతీయ మజ్దూర్ సంఘ్(బిఎంఎస్) జాతీయ అధ్యక్షులు వివిఎస్.సత్యన్నారాయణ ఆకాంక్షించారు. విశాఖలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, బిఎస్ఎన్ఎల్ లో చాలా మంది ఫీల్డు ఉద్యోగులు నేడు కోవిడ్ పాజిటివ్ తో బాధ పడుతున్నారన్నారు. వారికి ప్రభుత్వం నుంచి తక్షణ సదుపాయక కలుగజేయడానికి యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. అలా చేయడం ద్వారా ఉద్యోగులకు భరోసా ఏర్పడుతుందన్నారు. చాలా మంది ఫీల్డు సిబ్బంది కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా మిగిలిన ఉద్యోగులతో కలిసి పనిచేయడం ఇబ్బంది కరంగా మారుతుందని, దీనిని యాజమాన్యం, ప్రభుత్వం ద్రుష్టిలో ఉంచుకొని బీఎస్ఎన్ఎల్ లో విధులు నిర్వహిస్తున్నవారికి ఎవరికి కోవిడ్ పాజిటివ్ వచ్చినా వారి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం తక్షణమే అందించాలన్నారు. సీఎండీ త్వరగా కోలుకోవడం ద్వారా ఉద్యోగులకు, సిబ్బందికి విధి నిర్వహణలో  చురుకుగా పాల్గొనడానికి, ప్రజలకు సేవలు అందించడానికి వీలుపడుతుందని వివిఎస్. సత్యన్నారాయణ తెలియజేశారు.
సిఫార్సు