ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.కోటి విరాళం..


Ens Balu
7
తిరుమల
2021-05-02 07:47:40

తిరుమలలోని ఎస్వీబీసీ ట్రస్టుకి ఆదివారం రూ.కోటి విరాళం అందింది. చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సం‌స్థ ప్ర‌తినిధులు ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై దాత విరాళం డిడిని అద‌న‌పు ఈవో,  ఎస్వీబీసీ ఎండి ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి కార్యక్రమాలు ఎస్వీబీసీ ద్వారా అన్ని భాషల్లోనూ భక్తులకు చేరేలా చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దాతలు, టిటిడి సిబ్బంది డాలర్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు