తిరుమలలో ఆదివారం ఉదయం శ్రీ వారిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్, రాష్ట్ర ఆర్థిక,ప్రణాళిక, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి,ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ,
టిటిడి పాలక మండలి మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డిలు దర్శించుకున్నారు. స్వా మి వారి దర్శనార్థం ఆలయ మహ ద్వారం వద్దకు చేరుకున్న మంత్రులకు టిటిడి అదనపు ఈవో ఏ.వి ధర్మా రెడ్డి స్వాగతం పలికారు. శ్రీ వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజున ఎంతో పవిత్రత కలిగిన మహత్తరమైన తిరుమల శ్రీ వెంకటే శ్వర స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా నని.. ప్రస్తుతం కరోనా తో ఆంధ్రప్రదేశ్ తో సహా భారత దేశ ప్రజలంద రూ ఎంతో తల్లడిల్లు తున్నారని ,ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరిని కాపాడాలని.. ప్రతి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి వారి దీవెనలు, ఆశీస్సు లు ఎల్లవేళలా ఉండాల ని, ఆ దేవ దేవుని ప్రార్థించానని.. ప్రజలం దరికీ తప్పకుండా ఆ ఆశీస్సులు ఉంటా యన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.