నేడే రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల..


Ens Balu
4
Tirumala
2021-06-22 02:01:15

తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జులై నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 22న మంగళవారం ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. రోజుకు 5 వేల చొప్పున టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు. కాగా, జులై నెలకు సంబంధించిన గదుల కోటాను జూన్ 23న బుధవారం ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.  భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.