కోవిడ్ టీకాల పంపిణీలో భారత్ మరో మైలరాయి దాటింది. నిన్నటికి 30 కోట్ల డోసుల టీకాలు పూర్తి చేసుకుంది. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 40,45,516 శిబిరాల ద్వారా మొత్తం 30,16,26,028 టీకా డోసుల పంపిణీ జరగగా గత 24 గంటలలో 64,89,599 టీకాలిచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా వేగంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 54,069 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ విధంగా రోజుకు లక్ష లోపు కేసులు రావటం గత 17 రోజులుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల్లో అధికారుల ఉమ్మడి కృషి వలనే ఇంత పెద్ద స్థాయిలో ఫలితాలు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది.. మరో వైపు కరోనా చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 6,27,057 మంది కాగా.. చికిత్సలో ఉన్నవారు నికరంగా 16,137 మంది గత 24 గంటల్లోనే తగ్గగా చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 2.08% మాత్రమే కావటం గమనార్హం. కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 421 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24 గంటలలో 68,885 మంది కోలుకున్నారు. అంతకు ముందురోజుకంటే 14,816 మంది అదనంగా కోలుకున్నారు. ఇప్పటివరకూ కోవిడ్ బారిని పడి కోలుకున్నవారు 2,90,63,740 మంది కాగా గత 24 గంటలలో 68,885 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం 96.61% కు పెరిగింది. కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 18,59,469 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 39.78 కోట్లకు పైగా (39,78,32,667) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం 3.04% కాగా రోజువారీ పాజిటివిటీ 2.91% అయింది. వరుసగా 17 రోజులుగా ఇది 5% లోపే ఉండటం గమనార్హం..