విశాఖ నగర పర్యటనకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కు శపివానం విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం లభించింది. ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం గం. 11: 45 ని. లకు విశాఖ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి కి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ ఏ.బి. సింగ్, విశాఖ మేయరు జి.వి.హరి కుమారి, విశాఖ పోర్టు చైర్మన్ కె. రామ్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎమ్ఎల్సీ పి.వి.మాధవ్, తదితరులు స్వాగతం పలికారు. తరువాత ఆయన నేరుగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.