తిరుమల శ్రీవారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన గృహస్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశం టిటిడి కల్పించింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి జూన్ 30వ తేదీల మధ్య వరకు వర్చువల్ సేవా టికెట్లు పొందిన భక్తులు బుకింగ్ తేదీ నుండి సంవత్సరంలోపు శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. భక్తులు ఈ మార్పును గమనించి, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టిటిడి కోరుతుంది.