తిరుమలలోని శ్రీవారి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకి హైదరాబాద్కు చెందిన భవ్యా గ్రూప్ చైర్మన్ ఆనంద్ ప్రసాద్ రూ. కోటి రూపాయలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు. బుధవారం ఈ మేరకు దాత ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ఎ.వి. ధర్మారెడ్డికి దాత డిడిని అందజేశారు. తమవంతుగా శ్రీవారి భక్తులకు అన్నదానం చేయాలని దాతలు కోరారు. సాధారణ భక్తులకు శ్రీవారి సేవలను, దర్శనాలను మరింత చేరువ చేయాలని దాతలు ఈఓని కోరారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.