శ్రీవారి రూ.300 దర్శన టిక్కెట్లు విడుదల..
Ens Balu
3
Tirumala
2021-07-19 13:18:19
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం ఆగస్టు నెల కోటా రూ.300 టిక్కెట్లు రేపు(మంగళవారం) ఉదయం 9గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. భక్తుల సౌకర్యార్ధం 5వేల టిక్కెట్లను రేపు ఉదయం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నామన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వీటిని ఆన్ లైన్ లో ముందస్తుగా బుక్ చేసుకోవాలని టిటిడి అధికారులు కోరతున్నారు. ప్రతీరోజూ 5వేట టిక్కెట్లను భక్తుల కోసం ఆన్ లైన్ లో ఉంచతున్నట్టు ప్రకటించిన టిటిడి ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది.